ఒక రాత్రి, ముగ్గురు దొంగలు ఒక ధనవంతుని ఇంట్లో నుండి చాలా డబ్బు దొంగిలించారు. వాళ్ళు డబ్బులు అంతను ఒక సంచిలో పెట్టుకుని అడవికి వెళ్ళారు. వారికి చాలా ఆకలిగా అనిపించింది. కాబట్టి, వారిలో ఒకరు ఆహారం కొనడానికి గ్రామంలోకి వెళ్లారు. మిగతా ఇద్దరు డబ్బు సంచి చూసుకునేందుకు అడవిలోనే ఉండిపోయారు. ఆహారం కోసం వెళ్లిన దొంగకు ఓ చెడు ఆలోచన వచ్చింది. ఓ హోటల్లో భోజనం చేశాడు. తర్వాత వారి ఇరువురికీ ఆహారం కొన్నాడు అడవిలో తన ఇద్దరు సహచరులకు. ఆహారంలో విషాన్ని కలిపాడు. అతను అనుకున్నాడు, “ఆ ఇద్దరు ఈ విషపూరితమైన ఆహారం తిని చనిపోతారు. అప్పుడు నేనే డబ్బు మొత్తం డబ్బు మొత్తం నాకే కదా అనుకున్నాడు.” ఇంతలో, అడవిలో ఉన్న ఇద్దరు దుర్మార్గులు తిరిగి వచ్చిన తమ సహచరుడిని చంపాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఆ డబ్బును ఇద్దరికీ పంచుతారని అనుకున్నాడు. ముగ్గురూ దుర్మార్గులు పురుషులు వారి క్రూరమైన ప్రణాళికలను అమలు చేశారు. ఆహారం తెచ్చిన దొంగ డబ్బు అంతా తనకే కావాలని వచ్చాడు విషపూరిత ఆహారంతో అడవికి. అడవిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అతన్ని కొట్టి చంపారు. అప్పుడు ఆహారం తెచ్చిన్న దొంగని. విషపూరితమైన ఆహారం తిని అడవిలో వున్న మిగతా ఇదరు చనిపోయారు. ఈ విధంగా, ఈ దుష్ట వ్యక్తులు చెడు ఆలోచనలను కలిగి వుంటే ఇటువంటి ముగింపును ఎదుర్కొవాలసివస్తుంది.
నీతి: చెడు ఆలోచనలు ఎంతటి వారిని అయినను అంతం చేస్తాయి.