గుర్రం-గాడిద కథ
రామయ్య అనే వ్యాపారి సరుకులను గాడిద మీద పెట్టుకుని తన గుర్రం ఎక్కి పొరుగూరు
వెళుతున్నాడు, కొంత సేపటికి బరువు మోస్తున్న గాడిదకు ఆయాసం వచ్చి ఓ పావు బరువును
మోయమని గుర్రాన్ని అడిగింది, గుర్రం అది నా బాధ్యతకాదు, బరువులు మోయటానికి నువ్వు,
సుఖంగా జీవించడానికి నేను అన్నది.
గుర్రం-గాడిద కథ
బరువు మోయలేని గాడిద నడుము విరిగి క్రిందపడింది, వెంటనే వ్యాపారి గాడిదను అక్కడే
వదలి, ఆ బరువు మొత్తాన్ని గుర్రం పై వేసి తనూ ఎక్కి ప్రయాణం సాగించాడు.
గుర్రం-గాడిద కథ
ఆ కొంచం బరువును ముందే మోస్తే నాకు ఈ గాడిద బరువు తప్పేది కదా అని గుర్రం
మనసులో బాధపడింది.
నీతి: బరువు పంచుకుంటే బతుకు భారం తగ్గుతుంది.