కాకి - ఎద్దు కథ
అనగనగా ఓ కాకి, అది పగలంతా ఆహారం కోసం తిరిగి సాయంకాలం తన గూటికొచ్చేది.
అదే సమయానికి ఓ రైతు వద్ద ఉన్న ఎద్దు కూడా పొలం దున్నిన బడలికతో పశువులపాక ముందు
గడ్డిని నెమరువేస్తుండేది.
రెండూ కలసి కష్టసుఖాలు కలబోసుకునేవి.
కాకి - ఎద్దు కథ
ఓ రోజు ఎద్దును చూసి కాకి' మిత్రమా! నువ్వెంత వెర్రిదానివి! ఆ రైతు చూడు.
నీ మెడపై కాడిని ఉంచి పగలంతా చాకిరీ చేయించుకుని సాయంత్రానికి నాలుగు గడ్డిపరకలు ,
కాస్త కుడితి నీ ముఖాన పడేసి చేతులు దులుపుకుంటున్నాడు.
నువ్వేమో దానికే పొంగిపోయి, ఒళ్ళంతా హూనం చేసుకుంటున్నావు, నీ గిట్టలన్నీ అరిగిపోయాయి,
మెడ ఒరుసుకుపోయి మచ్చలు పడ్డాయి', అదే నేను చూడు ! నాకు నచ్చిన ఆహారం కనిపిచగానే
టక్కున ముక్కున కరుచుకుపోతాను, అది ఎవరిదైనా లెక్కపెట్టను,అందులో ఎంత మజా ఉందో
నీకేం తెలుసు ! చౌర్యం ఒక కళ.
కాకి - ఎద్దు కథ
అది ఎంత సంతోషం కలిగిస్తుందో నీకు తెలుసా! ఇకనైనా నిజం గ్రహించు! నీ బంధనాలు
తెంచుకో! పచ్చికబయళ్ళలొ హాయిగా స్వేచ్ఛగా విహరించు అంటూ హితోపదేశం చేసింది.
అంతా విన్న ఎద్దు " మిత్రమా ! నివనుకుంటున్నట్టు నేనేమి విచారంగా లేను.
నాకష్టంతో ఓ ఒక రైతు కుటుంబానికి సేవ చేయడమే గాక ఎంతో మంది ప్రజలకు ఆకలి
తీరుస్తున్నాననే సంతృప్తి ఉంది.
అది నాకు సంతోషాన్ని బలాన్ని ఇస్తోంది.
కాబట్టి నీ సలహాను పాటించలేకపోతున్నందుకు క్షమించు, అని తాపీగా చెప్పింది.
ఆ మాటలతో కాకికి కళ్ళు తెరుచుకున్నాయి. తన ప్రవర్తనను మార్చుకోవాలని నిర్ణయించుకుంది.